బీజేపీ నాయకుల నిరాహారదీక్ష

Published: Tuesday June 22, 2021

బెల్లంపల్లి, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కు మంజూరైన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలని స్థానిక బిజెపి నాయకులు 48 గంటల రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. సోమవారం నాడు నిరాహారదీక్షను బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి  ముని మంద రమేష్, దీక్షలు చేపట్టిన వారికి పూలమాలలు వేసి  దీక్షలను ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో కళాశాల నిర్మాణానికి అన్ని అవకాశాలు హంగులు ఉన్నాయని ఎంతో అభివృద్ధి చెందిన మంచిర్యాలలో కాకుండా బెల్లంపల్లిలో మెడికల్ కళాశాలను ప్రారంభిస్తే ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలతోపాటు బెల్లంపల్లి పట్టణం కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని రాజనర్సు, శ్రీనివాస్, నాగేష్, విజయ్, రేవెల్లి రాజలింగం, పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, తదితరులు పాల్గొన్నారు