చింత మాల కనకమ్మ మృతికి సంతాపం
Published: Wednesday June 30, 2021
మధిర, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : నిదానపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ చింతమాల శ్రీనివాసరావు గారి అమ్మ గారు చింతమాల కనకమ్మ గారి పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, గ్రామ నిదానపురం సర్పంచ్, బాధా కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, చావా వేణు, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు, దారా బాలరాజు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు, బిట్రా ఉద్దండు, ఆదిమూలం శ్రీనివాస్, మైలవరపు చక్రి, తదితరులు నివాళులు అర్పించి చింత మాల శ్రీనివాస రావు గారి కుటుంబానికి, సంతాపాన్ని తెలియజేసినారు చింత మాల శ్రీనివాసరావు అమ్మగారు చనిపోయిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్, మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, చింత మాల శ్రీనివాసరావుకు చరవాణి ద్వారా ఫోను చేసి జరిగిన విషయాన్ని తెలుసుకొని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసినారు
Share this on your social network: