బెల్లంపల్లి పట్టణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మున్సిపల్ జెడి రమేష్ బాబు

Published: Wednesday October 19, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కి మాస్టర్ ప్లాన్ తయారు చేసే ఇవ్వాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ రమేష్ బాబు అన్నారు.
మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు,
బెల్లంపల్లి మున్సిపాలిటీ లో మాస్టర్  ప్లాన్  నవంబర్ 15 వరకు తయారుచేసి ఇవ్వడం జరుగుతుందని, దానికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సర్వే టీమ్ కూడా వచ్చి సర్వే చేయడం జరుగుతుందని, మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రజలు, సిబ్బందికి సహకరించాలని ఆయన సూచించారు.
  ఈ కార్యక్రమము లో చైర్ పర్సన్ జక్కుల శ్వేతా , కమీషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు గెల్లి రాయలింగు ,రాములు నాయక్ ,కొక్కెర చంద్ర శేఖర్ ,కొమ్ముల సురేష్ ,సముద్రాల లావణ్య, తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.