భీమ్ సేన ఆద్వర్యంలో ఘనంగా బ్యాగరి దుర్గయ్య సంతాప సభ

Published: Wednesday August 04, 2021
హైదరాబాద్ ఆగస్టు 2 ప్రజాపాలన : భీమ్ సేన ఆద్వర్యంలో ఘనంగా బ్యాగరి దుర్గయ్య సంతాప సభ నిర్వహించారు. హాజరైన మహానాడు జాతీయ జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య. భీమ్ సేన జిల్లా కన్వీనర్ అధ్యక్షతన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని హనుమంతరావు పేట గ్రామ నివాసి అయిన మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడైన బ్యాగరి దుర్గయ్య అకాల మరణంతో సంతాప సభను సోమవారం నాడు అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. మాలమహానాడు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నాయకుడు బ్యాగరి దుర్గయ్య. వారు కరోనా మహమ్మారితో పోరాడి క్రీస్తు శేషులు అయిన సంగతి విధితమే. స్వర్గీయ బి.దుర్గయ్య సంతాప సభ నారాయణఖేడ్ నియోజకవర్గం లోని అంబేద్కర్ భవనంలో పలువులు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరై ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కీ.శే.దుర్గయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాల మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, సంగారెడ్డి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ బి.జనార్ధన్, జిల్లా కమిటీ సభ్యులు బి.మురళి, శ్రీ దుర్గా ప్రసాద్, టీచర్ పుండరీకం, జాన్ పాల్, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం మరియు కీ.శే. బి.దుర్గయ్య సతీమణి అరుణ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.