దేశానికి ఎనలేని సేవలు చేసిన యోధుడు బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సభలో కల్వకుంట్ల సంజయ్

Published: Thursday July 07, 2022
కోరుట్ల, జూలై 06 ( ప్రజాపాలన ప్రతినిధి ):
భారత మజీ ఉప ప్రధాని, సమాతావాది స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి 36వ వర్థంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహం వద్ద మున్సిపల్ పాలక పక్షం, జగ్జీవన్ రామ్ మెమోరియల్ కమిటీ ఆద్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా, కేంద్ర రక్షణ, కార్మిక శాఖల మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకవచ్చిన ఘనత ఆయనదని, బడుగు బలహీన వర్గాల పక్షన నిలబడిన యోధుడుగా దేశానికి  అనేక సేవలు చేశారన్నారు. అంతటి మహానీయున్ని మర్చిపోకుండా గుర్తుగా మన పట్టణంలో ఆయన పెరిట అతి పెద్ద పార్క్ నిర్మాణం జరుగుతుందని త్వరలోనే పూర్తి చేయిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనీల్, వైస్ చైర్మన్ గడ్డమిది పవన్, కమీషనర్ ఎం డి అయాజ్, టిఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనీల్, బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ కమిటీ అధ్యక్షులు పేట భాస్కర్, కౌన్సులర్లు మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, బలిజ పద్మ రాజరెడ్డి,సజ్జు నాయకులు బలిజ రాజరెడ్డి, పహీం,సనావోద్దిన్,
పసుల కృష్ణ ప్రసాద్, శనిగారపు రాజేష్, యాటం కృష్ణంరాజు, చిట్యాల సాయికృష్ణ, పొట్ట సురేందర్,దశరథం,రాంబాబు,రాజేష్ మరియు మన్సిపల్ సిబ్బంది, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area