రాజ్యాంగాన్ని కాదు పాలకులను మార్చాలి

Published: Friday February 04, 2022
బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు దొర శెట్టి సత్యమూర్తి
వికారాబాద్ బ్యూరో 03 ఫిబ్రవరి ప్రజా పాలన : రాజ్యాంగాన్ని మాట్లాడడం కాదు పాలకులను మార్చాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొర శక్తి సత్యమూర్తి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాత్రింబవళ్ళ కష్టపడి రచించారని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ఆర్థికంగా రాజకీయంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే అణగారిన ప్రజలకు అంతో ఇంతో మేలు జరుగుతుందని వివరించారు. దేశాన్ని సక్రమ మార్గంలో నడిపించే దిక్సూచి రాజ్యాంగ మని స్పష్టం చేశారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పెద్ది అంజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని మూర్ఖత్వమని ఘాటుగా విమర్శించారు. ప్రపంచ దేశాలకు భారతదేశ రాజ్యాంగం దిక్సూచిలా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లో అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ విజయ్ కుమార్ ఆర్ తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షుడు శివ బషీరాబాద్ ఇంచార్జ్ పాండు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు అభిషేక్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.