ఎర్రుపాలెం మండలం లోని అర్హులైన టువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ

Published: Tuesday July 27, 2021
ఎర్రుపాలెం, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : అర్హులైన టువంటి వారికి రేషన్ కార్డులను సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజు గారి చేతుల మీదగా రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో బట్టి  విక్రమార్క మాట్లాడుతూ ఈ మండలంలో 716 రేషన్ కార్డులు వచ్చాయని, ఇంకా మిగతా రేషన్ కార్డులను కూడా త్వరలో పంపిణీ జరుగుతుంది అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. నిత్యవసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి అన్ని సకాలంలో వచ్చేటట్లుగా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు రేషన్ బియ్యం ఒకటే ఇస్తున్నారని ఇకముందు అన్ని సరుకులు వచ్చే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో, వీఆర్వోలు, గ్రామ సర్పంచులు, మండల ఎంపిపి, రాజకీయ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు