డా.బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరం పునరంకితం అవుదాం :ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, కార

Published: Tuesday April 06, 2021
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : స్వాతంత్ర్య సమరయోధుడు, దళితుల వికాసం కోసం కృషి చేసిన దివంగత ఉప ప్రధాని డా.బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరం పునరంకితం అవుదామని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం భారత మాజీ ఉప ప్రధాని డా.బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని రాజారామ్ కాలనీ నందు స్థానిక కాలనీ అధ్యక్షులు రఘునాథ్ రావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ.అరేకపూడి గాంధీ, మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అంబేద్కర్ నగర్ వద్ద స్థానిక నాయకులతో కలిసి వారి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక టిఆర్ఎస్ నాయకులు రఘునాథ్ రావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని వేసవికాలంలో నిర్వహించేందుకు ముందుకు వచ్చిన సేవకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు బల్లింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, సంఘ సేవకులు రామస్వామి యాదవ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.