మోత్కుపల్లి కి స్వాగతం పలకన తక్కళ్ళ సంజీవ

Published: Monday October 18, 2021
యాదాద్రి అక్టోబర్ 17 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మాజీ మంత్రి, దళిత పక్షపాతి మోత్కుపల్లి నర్సింహులు నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నట్లు టిఆర్ఎస్ పార్టీ జిల్లా దళిత నాయకులు తక్కళ్ళ సంజీవ అన్నారు. మోత్కుపల్లి చేరికతో టిఆర్ఎస్ పార్టీ లో దళితులకు పూర్తి గౌరవం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న దళితులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తెలంగాణ భవన్ కు చేరుకుని ఘన స్వాగతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు.