మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 94వ జయంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం

Published: Tuesday October 05, 2021
కోరుట్ల, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) : మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్ రావు 94వ జయంతి సందర్బంగా పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఆద్వర్యంలొ కోరుట్ల పట్టణంలోని మున్సిపాల్ కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్ రావు తనయులు కోరుట్ల నియెజక వర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, క్రిష్ణరావు, శేఖర్ రావు లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతు కోరుట్లలో జరిగిన అభివృద్ది మాజీ మంత్రివర్యులు రత్నాకర్ రావు హయంలో జరిగిన అభివృద్దెనని ఆయన ఆశయాల కోసం ఆయన అడుగు జాడల్లోనే కొనసాగుతామని తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోయినిపెల్లి సత్యంరావు, తిరుమల గంగాధర్, కొంతం రాజం,నయీం, ఏలేటి  మహిపాల్ రెడ్డి, మ్యాకల నర్సయ్య, సోగ్రాబి, అక్బర్, చెన్న విశ్వనాధం, గడ్డం వెంకటేష్ గౌడ్, పోతుగంటి శంకర్ గౌడ్, ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్, గుప్త, ఖయ్యూం, యూసఫ్  షకీల్, ఎలేటి శశేందర్ రెడ్డి, గంగాధరి సతీష్, శివ తదితరులు పాల్గొన్నారు