రాం నూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
Published: Sunday October 10, 2021
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపూర్తి శైలేందర్ రెడ్డి
వెల్గటూర్, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలోరాంనూర్ గ్రామ శాఖ కార్యవర్గాన్ని శుక్రవారం రోజు ఏకగ్రీవంగా గ్రామ శాఖ అధ్యక్షులు గా బిడారి భూమయ్య, ఉపాధ్యక్షులుగా నర్సాపూర్ వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా పోరండ్ల శేఖర్, ప్రచార కార్యదర్శి గా సత్తయ్య, కోశాధికారిగా సుధాకర్, ఆర్గనైజర్ కార్యదర్శిగా బియ్యాల చిలకలయ, సంయుక్త కార్యదర్శిగా కె.శేఖర్, సోషల్ మీడియా నిర్వాహకుడుగా కుశనపల్లి దుర్గయ్య, గౌరవ సలహాదారుగా పి.శేఖర్ నియమించడం జరిగింది. ఇట్టీ కార్యక్రమంలో వెల్గటూర్ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, ముత్తు నూర్ ఎం.పి.టి.సి అనుమాల మంజుల, సందీప్ రెడ్డి, శ్రీకాంత్ రావు, సహకార సంఘం మాజీ అధ్యక్షులు గొల్ల తిరపతి, లచ్చిరెడ్డి, అనుమల శ్రీను, సింగతి శ్రీను, జూపాక ప్రవీణ్, కుశనపల్లి సతీష్, బి.మల్లయ్య, పి.పోశయ్య, కుంచనపల్లి కృపాకర్, కుంచనపల్లి శేఖరు, మగ్గిడి గంగయ్య, వెంకటేష్, లక్ష్మణ్, సందీప్, బాలయ్య, సాయి తేజ, బానయ్య, వంశీ శేఖర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: