మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Monday March 28, 2022

రాయికల్, మార్చి 27 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలంలోని కుమ్మరి పల్లి గ్రామంలో 5 లక్షల నిధులతో సి.సి రోడ్డు నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాయికల్ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు అశ్విని జాదవ్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి చైర్మన్ గన్ని రాజరెడ్డి గ్రామ సర్పంచ్ స్వప్న వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు నాగరాజు ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు గ్రామస్తులు, టిఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి తలారి రాజేష్, యూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం, వడ్డే లింగాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పి.హెచ్.సి) జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు, అలాగే కట్కాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని డి.ఎం.హెచ్.ఓ. శ్రీధర్ గారితో కలిసి సందర్శించారు.