ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాడీ ఫ్రీజర్ ఉంచిన ఎల్.ఎం. కొప్పుల సోషల్ సర్వీస్ చైర్ పర్సన్ స్న

Published: Monday March 21, 2022

వెల్గటూర్, మార్చి 20 (ప్రజాపాలన ప్రతినిధి) : ఎల్.ఎమ్.కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత వెల్గటూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం బాడీ ఫ్రీజర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లక్ష రూపాయల విలువ గల ఒక్కొక్క బాడీ టీచర్స్ అందజేస్తున్నట్లు ఆమె అన్నారు. ధర్మారం మండలం లోని నంది మేడారం వెల్గటూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ధర్మపురి ఆరోగ్య కేంద్రానికి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఆదివారం రోజు అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. గొల్లపల్లి బుగ్గారం పెగడపల్లి మండలాలకు సోమవారం రోజు అందజేస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజల సౌకర్యం కోసం మండల నాయకులకు విజ్ఞప్తి మేరకు అందించినట్లు ఆమె పేర్కొన్నారు. మంత్రి ఈశ్వర్ మీ సేవ కోసమే ఆలోచిస్తారని ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఆమె అన్నారు. మరిన్ని సేవలు చేయడానికి ఎప్పుడు మీ మధ్య లోనే ఉంటాము ఎప్పుడు మమ్మల్ని ఆదరించండి అని ఉన్నారు. అనంతరం వెల్గటూర్ పట్టణ తె.రా.స ఆధ్వర్యంలో చైర్పర్సన్ స్నేహలతను శాలువాలతో బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి కునమల్ల మాల్ల లక్ష్మి లింగయ్య, జెడ్.పి.టి.సి బి.సుధారాణి రామస్వామి, కో ఆప్షన్ సభ్యులు ఎం.డి రియాజ్, మండల టి.ఆర్.ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు సింహాచలం జగన్, జూపాక కుమార్, ఎండపల్లి సహకార సంఘం అధ్యక్షులు గూడ రామ్ రెడ్డి, రంగు తిరుపతి గౌడ్, చల్లూరి రామచంద్ర గౌడ్, పత్తిపాక వెంకటేష్, గుండె జగదీష్, వెల్గటూర్, ధర్మారం మహిళ మండల శాఖ అధ్యక్షురాలు సింధుజారెడ్డి, కనక లక్ష్మి, ద్యావనపల్లి రాజయ్య, ఆర్గనైజర్ సెక్రటరీ కొప్పుల రవీందర్, ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల సురేష్,బందెల నరసయ్య, కుమ్మర పల్లె సర్పంచ్ కొప్పుల విద్యాసాగర్, ఉపారపు సతీష్, గుండాటి రాజేశ్వర్ రెడ్డి, సుంచు మల్లేశం, వైద్యాధికారి డాక్టర్ రమేష్, సి.హెచ్.వో జగన్నాథం, ఫార్మసిస్ట్ తిరుపతి, సీనియర్ నర్స్ జమున, సూపర్వైజర్ శ్రీనివాస్, ఏ.ఎన్.ఎం భాగ్యలక్ష్మి, శారద, నళిని, ఆశ వర్కర్లు, ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు