స్లేట్ హై స్కూల్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో బహుమతులు

Published: Friday January 20, 2023

 జన్నారం, జనవరి 19, ప్రజాపాలన: ఈ డాక్ వారు నిర్వహించిన ఈ డాక్ ఇంటెక్ అనే కార్యక్రమంలో జన్నారం మండలం స్లేట్ హై స్కూల్ విద్యార్థులు వివిధ రంగాలలో రాష్ట్రస్థాయి బహుమతులు సాధించారని గురువారం ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో ఎం.ప్రణవి 3 వ తరగతి రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి గెలుచుకుంది, ఎస్.సాహిత్య 5వ తరగతి రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి గెలుచుకుంది. అలాగే హైటెక్ ఆక్టివిటీలో ఏ.శాన్వి  2వ తరగతి ఎం.డి ఉజేయిర్ 3వ తరగతి ఆర్.రితేష్ 5వ తరగతి రాష్ట్రస్థాయిలో కన్సోలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అలాగే నృత్యాచారిని నర్మదా, డాన్స్ మాస్టర్ పవన్ గార్లను పాఠశాల ప్రిన్సిపల్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి అభినందించారు. పాఠశాల విద్యార్థులు చదువులోనే కాకుండా వివిధ రంగాలలో విద్యార్థులు రాణించేందుకు స్లేట్ పాఠశాలలో వివిధ రకాల కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ని బోధించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.