రాములు నాయక్ ఎమ్మెల్సీగా గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు

Published: Saturday March 13, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : ఉమ్మడి నల్గొండ ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, శుక్రవారం అరూర్, గుర్నాథ్ పల్లి, వెంకటాపురం, వేములకొండ, ముద్దాపురం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డి, ఎంపీటీసీ సామ రాంరెడ్డి, ఆప్షన్ సభ్యులు ఎస్.కె రసూల్, నాయకులు మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య, జినుకల దానయ్య, వేలిమినేటి పెంటయ్య, బుర్ర నరసింహ, రాములు, ఆవుల స్వామి, బండారు నరసింహ రెడ్డి, నాగార్జున రెడ్డి, కార్యకర్తలు వెంకటేశం, మత్స్యగిరి, అంజయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.