ప్రజల దాహార్తిని తీర్చడానికి నడుంబిగించిన బీజేపీ యువనేత బీపీ నాయక్
Published: Monday April 04, 2022
పలుచోట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - నాయక్ భరోసా పేరిట చలివేంద్రాలు ఏర్పాట్లు
బోనకల్, ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: మండల ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రముఖ ఎన్నారై బీజేపీ యువనేత బీపీ నాయక్ నడుంబిగించారు. మే నెల రాకముందే వేసవికాల తీవ్రతను అంచనా వేసి, ప్రజలకు, పాదచారులకు, ప్రయాణికులకు మిగతా వారందరికీ మంచినీటి సదుపాయం అందుబాటులో ఉండే విధంగా మండల కేంద్రంలోని ఖమ్మం బస్టాండ్ సెంటర్, సినిమా హాల్ సెంటర్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- నాయక్ భరోసా చలివేంద్ర శిబిరాలను సర్పంచ్ సైదా నాయక్, బీపీ నాయక్ తనయ ఇషిక పరమేశ్వరన్ లు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సైదానాయక్, ఇషికల చేతుల మీదుగా ప్రజలందరికీ చల్లని మజ్జిగ, మంచినీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుగులోత్ నాగేశ్వరరావు, గంగుల నాగయ్య, తాళ్లూరి సురేష్, కాలసాని పరశురామ్, మరీదు పరశురాముడు, సేవాలాల్ మహారాజ్ సమితి సభ్యులు గుగులోత్ కిషోర్, రమేష్ నాయక్, సైదులు, నాగేంద్రబాబు, సూర్య నాయక్, ఉపేందర్, ఉపేంద్ర, భీమానాయక్, ప్రసాద్, గ్రామ పెద్దలు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: