పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దడమే లక్ష్యం

Published: Friday December 23, 2022
వికారాబాద్ మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర
వికారాబాద్ బ్యూరో 22 డిసెంబర్ ప్రజాపాలన : పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని వికారాబాద్ మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిలో ఉన్న బస్ స్టాండ్ సమీపంలో మరుగుదొడ్ల గోడలపై అందమైన పేయింటింగ్ వేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఆభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ కు వెళ్ళే ప్రధాన రహదారి పక్కన ఎంఎల్ఏపి ప్లాంటేషన్ చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.