ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ జడ్ చోంగ్తు ని కలిసి "జారే ఆదినారాయణ"

Published: Wednesday June 08, 2022
అశ్వారావుపేట (ప్రజాపాలన ప్రతినిధి)అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని, గిరిజనులు  స్వయంశక్తి తో ఉపాధి అవకాశాలు పొందుటకు అవకాశం కల్పించగలరని విన్నవించగా దానికి సానుకూలంగా స్పందించింన కమిషనర్,వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల గురించి పరిష్కరించగలరని మరియు ఆశ్రమ పాఠశాలను డిగ్రీ వరకు  అప్‌గ్రేడ్ చేయుట గురించి అర్హత గల వ్యాయామ ఉపాధ్యాయులను  ప్రమోషన్ పొందుటకు తగు చర్యలు చేపట్టగలరని, అర్హత గల పీడిలను ఒడి పై ఎంపీడీ చేయుట గురించి విన్నవించిన,తెలంగాణ రాష్ట్రం వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం పి ఈ టి ఎ,స్టేట్ జనరల్ సెక్రెటరీ కృష్ణమూర్తి గౌడ్ ,ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు శంకరయ్య, జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, జిల్లా జనరల్ సెక్రెటరీ కుర్సం రామనాథం, రాష్ట్ర కార్యదర్శి కొమరం వెంకట్ నారాయణ, భద్రాద్రి జిల్లా సెక్రెటరీ  సోయం నాగేశ్వరరావు, జిల్లా ట్రజరల్ బొల్లి గోపాలరావు,కార్యదర్శులు సున్నం రామారావు,పద్దం రాంబాబు,వారి తో కలిసి జారి ఆదినారాయణ 
ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్,కి వినతి పత్రాన్ని సమర్పించారు.నియోజకవర్గంలోని గిరిజన యువతీ యువకులకు ట్రైకార్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించాలని వినతి పత్రాన్ని  అందజేసి,తదనంతరం కుంజా శంకరయ్య,కి ట్రైకార్ జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ పొందిన కుంజా శంకరయ్య,ని వ్యాయామ ఉపాధ్యాయుల తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.