శ్రీ సాయిరాం బేకరీలో కార్మికుడు మృతి

Published: Wednesday July 14, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : శ్రీ సాయిరాం బేకరీలో కిచెన్ శుభ్రం చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు తో మృతి చెందాడు. మీర్ పేట పోలీస్ స్టేషన్ లలోఈ సంఘటన జరిగింది. మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చేవెమ్ల మండలం రోళ్ళ బండ తండ కు చెందిన భానోత్ లక్ష్మణ్ నాయక్ (19) మీర్పేట్ మెయిన్ రోడ్డు న్యూ సర్వోదయ నగర్ కాలనీలలో ఉన్న శ్రీ సాయిరాం బేకరీలో కిచెన్లో పనిచేస్తూ ఉండేవారు. ఆదివారం(11/7/2021) సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాలకు మొదటి అంతస్తు లో కుకింగ్ స్టాండ్ పైకి ఎక్కి  కిచెన్ శుభ్రం చేస్తూ కింద పడ్డాడు. భానోత్ లక్ష్మణ్  కింద పడి తల వెనుక భాగానికి దెబ్బ తగిలిన వెంబడే బేకరీ ఓనరు 108 వాహనం ద్వారా కాంచన బాగ్ లో ఉన్న అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన డ్యూటీలో ఉన్నా డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. అక్కడినుండి ఉస్మానియాకు తీసుకెళ్లారు. బాడీని పోస్టుమార్టం చేసే తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 174, 494 సెక్షన్లు కేసులు  నమోదు చేసి దర్యాప్తు చేపట్టారనీ తెలిపారు.