గొల్ల కురుమలను మోసం చేసిన తెలంగాణ ప్రభుత్వం ----- బీర్ల లింగస్వామి
Published: Thursday November 24, 2022
చౌటుప్పల్ నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలను మోసం చేసిందని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే ఖాతాలలో డబ్బులు వేస్తున్నట్టుగా డ్రామాలు ఆడిందని బిజెపి పార్టీ పెద్ద కొండూరు గ్రామ శాఖ సహాయ కార్యదర్శి బీర్ల లింగస్వామి కురుమ మండిపడ్డారు. లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు వేస్తున్నామని చెప్పి తమ సొంత డబ్బులను కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఖాతాలను ఫ్రీజ్ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఎన్నికలు ముగిసి 20 రోజులు అవుతున్న గొల్ల కురుమలకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం గొల్ల కురుమలపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. వెంటనే గొల్ల కురుమలకు డబ్బులను విడుదల చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Share this on your social network: