చెంగిచెర్ల బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి చామకూర మల్లారెడ్డి

Published: Monday August 01, 2022
మేడిపల్లి, జులై31 (ప్రజాపాలన ప్రతినిధి) 
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో బోనాల పండుగను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాలకు చేరుకొని బోనాల సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెంగిచెర్లలోని శ్రీ పోచమ్మ, కొండ పోచమ్మ అమ్మవారి ఆలయాలను మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, సుమన్ నాయక్, కోఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న గౌడ్, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, కొత్త పాండు గౌడ్,3వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీర్వాదములు తీసుకున్నారు.