శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయ చతుర్ధ వార్షికోత్సవం

Published: Saturday October 08, 2022
వికారాబాద్ బ్యూరో 7 అక్టోబర్ ప్రజా పాలన : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని న్యూ గాంధీ గంజ్ లో గల శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయం పునః నిర్మాణ చతుర్థ వార్షికోత్సవాన్ని ఆలయ ధర్మకర్త పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్లీడర్ అర్ద సుధాకర్ రెడ్డి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శివపార్వతులకు హోమం  కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం1 గంట వరకు కొనసాగింది. మహా అన్నదానంతో ముగింపు అయ్యింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తిలకించడానికి వికారాబాద్ పట్టణం నుండి భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడం జరిగింది. శివపార్వతుల కళ్యాణం లో పాల్గొన్న భక్తులు ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి  మంజుల రమేష్, నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జైదుపల్లి మురళి, వేణుగోపాల్ రెడ్డి, చందర్ నాయక్, రమేష్ గౌడ్, మోముల రాజ్ కుమార్, రెడ్యానాయక్, అనంత్ రెడ్డి, సదానంద రెడ్డి, నాగేష్ గుప్తా, మల్లారెడ్డి, అనంత్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు.  ప్రభాకర్ రెడ్డి రామకృష్ణారెడ్డి,కృష్ణ, నరసింహులు, మిర్యాణం సురేందర్,వినోద్,టీ,విజయ్ కుమార్, గొల్ల నాగేష్, బాలకృష్ణ, వెంకటేష్, శ్రీనివాస్ యాదవ్, బిజిలి రాహుల్, సత్యం, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు :