లక్ష్మీపురంలో పల్లెప్రగతి గ్రామావికాసం

Published: Wednesday March 24, 2021
​గొల్లపల్లి, మార్చి 23 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లి మండలం లాక్ష్మీపురం గ్రామంలో ​పల్లెప్రగతి గ్రామావికాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామసర్పంచ్ దావు మల్లక్క అధ్యక్షతన ఉదయం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ముఖ్యఅధితిగా విచ్చేసిన ఎంపీపీ నక్క శంకర్ మాట్లాడుతూ ప్రజల ప్రభుత్వం సమన్వయంతో  పరస్పర సహకారంతో అభివృద్ధిసాధ్యం అవుతుంది అని అభిప్రాయపడ్డారు. ఆనంతరం పల్లె ప్రగతి కమిటీసభ్యలు మరియు సంబంధింత అధికారులతో ప్రభుత్వ మౌలిక వసతులు నిర్మాణాలు వాడవాడలా తిరిగి సమస్యలు గుర్తించి ప్రజలతో పరిస్కారంచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జలందర్తె రాస మండల అధ్యక్షులు రమేశ్ పార్టీ కార్యదర్శి మారంపల్లి బాబు వైస్ ఎంపీపీ సత్యం ఏఎం సి ఛైర్మెన్ లింగారెడ్డి బీసీ సెల్ మండల అధ్యక్షుడు బలభక్తుల కిషన్ ఎంపీడీఓ జనార్ధన్ ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి మాజీ ఎఎస్ ఎంసి చేర్మెన్ నాగభూషణం సమస్త మండల గ్రామ నాయకులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.