రెండు వేల ఐదువందల నోట్లను రద్దు చేయాలి
Published: Thursday December 15, 2022
విబిఏ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్
జన్నారం, డిసెంబర్ 14, ప్రజాపాలన: భారత దేశంలో నరేంద్రమోడి ప్రభుత్వం ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దు చేసి బ్లాక్ మని సులువుగా దాసుకోవడానికి రెండు వేల నోటు, ఐదు వందల నోటు తీసుకొచ్చిరన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా, జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రస్తుతం తెచ్చిన చలమనిల్లో ఉన్న రెండు వేల నోటు కనబడకుండ పోయిందన్నారు. దాసుకోవడం కొరకు డబ్బున్న వాళ్ళ దగ్గరకు పోయిందని, ఈజీగా దాసుకోవడానికి కాబట్టి కావాలని ఈ రెండు వేల నోటు బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చినట్లు ఉంది. కాబట్టి దేశంలో నోట్లు మార్పిడి చేసుకోవడానికి ఒక పదిహేను రోజుల నుండి మూడు నెలల టైం ఇచ్చి, రెండు వేల నోటు, ఐదు వందల నోటును రద్దు చేయడానికి సమయం ఇవ్వాలని ఆయన కోరారు. ఇంత పెద్ద నోటుతో ప్రజలకు ఏమి ఉపయోగం లేదని, కాబట్టి వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this on your social network: