మరోసారి ఉదారత చాటుకున్న టీపీసీసీ కార్యదర్శి దండెం మాధవి రాంరెడ్డి దంపతులు
Published: Thursday August 04, 2022
ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్ పేట్ 6వ వార్డుకు చెందిన కీ.శే. ధాన్యమైన పెద్దరంగయ్య, కళమ్మ దంపతుల కుమార్తె స్వాతి వివాహానికి చేయూతనిచ్చిన దండెం మాధవి రాంరెడ్డి దంపతులు.
స్వాతి చిన్నతనం లోనే తండ్రి చనిపోవడంతో తల్లి కళమ్మ కష్టపడి పిల్లలను చదివించడం జరిగింది, ఈనెల 5వ తారీఖున స్వాతి వివాహం ఉండడంతో పేదరికం మూలంగా ఆవిడ ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ, టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి గారిని ఆశ్రయించడం జరిగింది, వెంటనే స్పందించిన దండెం రాంరెడ్డి దంపతులు స్వయంగా నూతన వధువు చేతికి తల్లి సమక్షంలో పెళ్లికి కావలసిన నూతన వస్త్రాలు, బియ్యం అందజేయడం జరిగింది.
Share this on your social network: