రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకై రేవంత్ రెడ్డికి వినతి పత్రం మానకొండూరు మార్చి 03 ప్రజాపాలన రిప

Published: Saturday March 04, 2023

రెడ్డి  సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకై శుక్రవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.  2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో అప్పటి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు సిద్ధమని పార్టీ పార్టీల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటివరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కాలేదని, ఇప్పటికైనా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి  తీసుకురావాలని రేవంత్ రెడ్డిని రెడ్డి  సంఘాల నాయకులు కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికి ఒకటైన జనరల్ రిజర్వేషన్ పద్ధతిలో గురుకులాలను ఏర్పాటు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు ఐదువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ప్రతి పేద విద్యార్థికి 25 లక్షల విదేశీ విద్య అనేది ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న, రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.