చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలిసిపిఎం

Published: Tuesday October 12, 2021
ధిర, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని చిరువ్యాపారులకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందించాలని సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు తేలప్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి డిమాండ్ చేశారు . మున్సిపాలిటీ పరిధిలో అనేక రకాల చిరువ్యాపారులు ఉన్నారని వారికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఏవిధమైన హామీలు లేకుండా  బ్యాంకులు ద్వారా రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపారులకు మార్కెట్ సౌకర్యం కల్పించి షాపులు నిర్మించాలని పేర్కొన్నారు. గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర ధరలను తగ్గించాలని, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో పందులను నిర్మూలించాలని, డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు, కాలువలను సౌకర్యాలు కల్పించిలని, తదితర డిమాండ్లతో పరిష్కరించాలని మెయిన్ రోడ్ పై నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లా చారి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వడ్రాణం మధు చిరువ్యాపారులు ఆ ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు