అమ్మ చెస్ట్ ఆస్పిటల్ లో వ్యక్తి మృతి - ఆందోళనతో కుటుంబ సభ్యులు
Published: Friday October 29, 2021
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని ఒక ప్రయివేట్ చెస్ట్ ఆస్పిటల్ లో గొల్లపెళ్లి మండల్ బొంకూర్ గ్రామానికి చెందిన గొల్లపెల్లి లస్మయ్య (60) మరణించాడు. గురువారం రోజున వైద్యం కోసం రాగ నంజు వచ్చిందని తీసివేయలని వైద్యుడు లోనికి తీసుకువెళ్లి వైద్యం చేయడంతో మృతి చెందాడంతో మృతదేహాన్ని హాస్పిటల్ గెట్ వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లింస్తేనే మృతున్ని తీసుకెళ్తామని అనడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Share this on your social network: