రంగారెడ్డి కాంగ్రేస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్ కుమార్

Published: Monday August 23, 2021

దళిత గిరిజనుల మీద ప్రేమ ఉంటే తన MLA పదవికి రాజీనామ చేయాలి.

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 22 ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ప్రెస్ మిట్లో మాట్లాడుతూ దళిత గిరిజన ఆత్మగౌరవ సభను రాష్ట్రంలో లోని ఇబ్రహీంపట్నం నుండి వేలాదిగా తరలి వెళ్లడం  జీర్ణించుకోలేక, MLA మంచి రెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రేస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, ప్రభుత్వం తెచ్చిన దళిత బంధు రాష్ట్రమంతాటా దళిత గిరిజనులకు ఇవ్వాలని కాంగ్రేస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. హుజురాబాద్ ఉప ఎన్నికలు వస్తే ఏ విధంగా నైతే ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల వరాల జల్లు కురిపిస్తున్నరు  మూడు సార్లు ఎమ్మెల్యే గా వుండి అభివృద్ధి కి నోచుకోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గన్ని అభివృద్ధి చేసే అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడైనా వెంటనే  MLA పదవికి రాజీనామా చేసి దళిత వ్యతిరేకిగా పెరు పొందిన అటువంటి  మీరు దళిత పక్షాన నిలబడే వ్యక్తి ఐతే వెంటనే రాజీనామా చేయాలని  కాంగ్రెస్ పార్టీ  పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జడలు రవీందర్, యువ నాయకులుఎండీ గౌస్, సొప్పరి రవికుమార్, పెద్ద గారి శ్రీకాంత్, మాదరి శివకుమార్, మురళీ, రాజు, కార్తీక్, రాజు, శివ, అరుణ్ పాల్గొన్నారు.