బంగారు మైసమ్మను దర్శించుకుని పూజలు చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Published: Wednesday October 13, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలోని బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలో నెలకొల్పిన శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో జరిగిన హోమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, గెళ్లి రాజలింగు, శ్రీనివాస్, బెల్లంపల్లి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస టీవీఎస్ నాయుడు దుర్గామాత భక్తులు పాల్గొన్నారు.
Share this on your social network: