బంగారు మైసమ్మను దర్శించుకుని పూజలు చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Wednesday October 13, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం నాడు నియోజకవర్గ పరిధిలోని బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలో నెలకొల్పిన శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో జరిగిన హోమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, గెళ్లి రాజలింగు, శ్రీనివాస్, బెల్లంపల్లి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస టీవీఎస్ నాయుడు దుర్గామాత భక్తులు పాల్గొన్నారు.