ప్రకృతి విపత్తులలో సహాయపడినవారిని సన్మానించిన -- జిల్లాఎస్పీ సింధు శర్మ
Published: Saturday July 23, 2022
రాయికల్, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి):
భూపతిపూర్ రామాజీపేట గ్రామాల మధ్యరోడాంలోఎన్.టివి రిపోర్టర్ వార్తకవరేజ్ కొరకువెళ్లి దురదృష్టవశాత్తు నీటి ప్రవాహములో పడి గల్లంతయిన సమయంలో గాలింపు చర్యలో భాగంగా పోలీసులకు,రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పూర్తిగా సహాయ, సహకారాలు అందించినందుకు గాను జగిత్యాల జిల్లాపోలీస్ సూపరిండెంట్ సింధు శర్మ ,డి.ఎస్పి. ప్రకాష్,సిఐ కృష్ణకుమార్ భూపతిపూర్ గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ను, రామాజీపేట గ్రామ ఉపసర్పంచ్ హరీష్ రావును,మైతాపూర్ గ్రామబుడిగేజంగాల యువకులను అభినందించి సన్మానించారు.
Share this on your social network: