అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Published: Monday December 13, 2021

కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న పక్కా సమాచారం తో స్వయంగా రంగంలోకి దిగిన సీఐ  రాజశేఖర్ రాజు పైడిమడుగు గ్రామంలో కోరుట్ల సిఐ రాజశేఖర్ రాజు, ఎస్ఐలు సతీష్, రాజ్యలక్ష్మి అధ్వర్యంలో తనిఖీ చేయగా కోరుట్ల మండలం లోని పైడి మడుగు గ్రామంలో వాగు నుండి కోరుట్ల పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న (7) ఇసుక ట్రాక్టర్లలు పట్టుకొని కేస్ నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. పైడి మడుగు గ్రామంలో అక్రమంగా నిల్వవుంచిన 30 ట్రిప్పుల ఇసుకను కోరుట్ల తహశీల్దార్ కు అప్ప చెప్పడం జరిగింది అని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, ఎస్ఐ సతీష్ కుమార్, ఎస్ఐ 2 రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.