సాంస్కృతిక వైభవానికి నిదర్శనం కళా సంస్థలు
Published: Monday August 01, 2022
జన్నారం, జూలై 31, ప్రజాపాలన: సాంస్కృతిక వైబవానికి నిదర్శనం జానపద కళా సంస్థలని టిజివో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ అన్నారు, ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పైడిపల్లి పంక్షన్ హల్ లో నిర్వహించిన ఆదర్శ కళాసమితి ఇరువైవ వార్షికోత్సవంకు ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. తెలంగాణలో ఎంతో మంది ప్రతిబవంతులైన కళాకారులున్నారని కళరంగానికి గత ఇరువై సంవత్సరముల నుండి ఎనలేని సేవచేస్తు ఎంతోమంది కళాకారులు ఉన్నత స్థానానికి వెళ్లేందుకు కృషివచేస్తున్న ఆదర్శ జానపద సాంస్కృతిక కళా సంస్థ సభ్యులను అభినందించారు. అనంతరం అత్యంత ప్రతిభావంతులైన కళాకారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యాక్రమంలో సాంస్కృతిక కళా సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉమ మహేశ్వర్ రావు, గౌడసంఘం మెుకుదేబ్బ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మమతగౌడ్, సినీ హీరో రణబీర్ గౌడ్, మండల వైస్ ఎంపిపి సుతారి వినయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భరత్ కుమార్, ఆదర్శ కళాసమితి అధ్యక్షుడు లింగంపెల్లి రాజలింగు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు.
Share this on your social network: