పదో వార్డు లో శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్*

Published: Friday November 25, 2022
మధిర నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి
మధిర మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం గురువారం పదో వార్డ్ లో కొనసాగింది. వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు తో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితో కలత  కమిషనర్ రమాదేవి ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారుపారిశుధ్యం పై, తడిచెత్త-పొడిచెత్త, విధి దీపాలు, మంచి నీటి సరఫరా, పన్ను బకాయిలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు . అలాగే తడి చెత్త-పొడి చెత్త వేరు చేయుటపై అవగాహన కల్పించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ప్రజలకు వారు వివరించారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ మేనేజర్ రవీందర్ , వార్డు ఆఫీసర్ లు, వార్డ్ ఇంచార్జ్ లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.