క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఎంపిపి అరిగెల మల్లికార్జున

Published: Friday July 22, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై20 (ప్రజాపాలన, ప్రతినిధి) : క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ తెలిపారు. గిరిజన క్రీడాకారిణి కరీనా వచ్చే నెలలో జరిగే వరల్డ్ యూత్ ఉమెన్ హ్యడ్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కాగా బుధవారం ఆమెను జిల్లా విద్యాశాఖ అధికారి మన్నెమ్మ తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరీనా మంచి ప్రతిభ కనపరచి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. తన పరిస్థితి తెలుసుకొని ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థికి రూ 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కడతల రాజేష్,అరవింద్,ప్రిన్సిపాల్ రమ్య లక్ష్మి, గంధం శ్రీనివాస్, పెంటయ్య పాల్గొన్నారు.