కార్పొరేషన్లో మౌళిక వసతుల కల్పనకు కృషి మేయర్ సామల బుచ్చిరెడ్డి

Published: Tuesday May 17, 2022
మేడిపల్లి, మే 16 (ప్రజాపాలన ప్రతినిధి)

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మౌళిక వసతుల కల్పనకు  కృషి చేస్తున్నట్లు మేయర్ సామల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ బుడగ జంగల కాలనీలో రూ 40 లక్షలతో  డ్రైనేజి మరియు సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, డిప్యూటీీీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ లతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోదుగు మోహన్ రెడ్డి, మహ్మద్ అలీం, మోతె రాజు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.