మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభ ను జయప్రదం చేయండి: జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గురుప్రసాద్ రా

Published: Monday October 18, 2021
బోనకల్, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతకై మాదిగ ఉద్యోగుల 5వజాతీయ మహాసభను అక్టోబర్ 24న హైదరాబాద్లో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గురుప్రసాద్ రావు బోనకల్ మండలం జానకీపురం గ్రామంలో కరపత్ర ఆవిష్కరణ స్థానిక సర్పంచ్ చేతులమీదుగా చేశారు. మాదిగల సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా వర్గీకరణే ధ్యేయంగా ఎం ఈ ఎఫ్ కార్యాచరణగా మన భవిష్యత్తు బాధ్యతగా మాదిగ ఉద్యోగులందరూ హాజరుకావాలని కర్లకుంట శేషయ్య ఆర్డీవో కొత్తగూడం కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట హనుమంతరావు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లానాయకులు చిలకనాగరాజు, రుద్రపోగు శ్రీనివాసరావు, రుద్రపొగు సుధాకర్, ఎస్ఎంసి ఛైర్మన్ జాన్ కోటేశ్వరావు, కర్లకుంట స్వామి సార్ బాబుఏలిశాన్, ఎమ్మార్పీఎస్ సీనియర్ సలహాదారులు గొల్లమందల అంజయ్య, ఖమ్మంజిల్లా ఎంప్లాయీస్ సంగం పాల్గొన్నారు.