మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలు
Published: Monday September 06, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మేయర్. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ జేనిగా భారతమ్మ కొమరయ్య ఆధ్వర్యంలో వెంకటాపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ మేయర్ పాల్గొని, సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డిగారు, స్థానిక కార్పొరేటర్ భారతమ్మ కొమురయ్య యాదవ్, మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమురయ్య యాదవ్, సాంబశివ, శ్రీనివాస్ యాదవ్, పురుషోత్తం, కుమార్ గౌడ్, సంజయ్ సింగ్, శ్రీకాంత్, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: