కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Wednesday June 16, 2021
పరిగి, 15 జూన్, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఇస్తున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్ జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి సురేందర్  రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రాజేందర్ పి ఎ సిఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ స్థానిక సర్పంచ్ మరియు ఎంపీటీసీ మండల ఏ ఓ ప్రభాకర్ రెడ్డి నాయకులు మహాలింగం రైతులు తదితరులు పాల్గొన్నారు.