పెళ్లి రోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో వస్త్ర దానం.

Published: Monday February 07, 2022
మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మధిరలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ సభ్యులు మరియు మధిర మండల ఆర్యవైశ్య కోశాధికారి దొడ్డా శ్రీనివాస రావు లక్ష్మీ పెళ్లి రోజు సందర్భంగారోజు సందర్భంగా ఆర్ కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో పేదలకు మతిస్థిమితం లేని వారికి దుప్పట్లు లుంగీలు అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్కే ఫౌండేషన్ అనాధాశ్రమంలో దిక్కు లేని వారు ఎంతోమంది ఆశ్రయం పొందుతున్నారు వీరి సేవ ఎవరు చేయలేనిది.. వారికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి అంటూ మధిర రెస్క్యూ టీం సేవలను కొనియాడారు.. ఈ సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ నిస్సి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అంటూ మతిస్థిమితం లేని వారికి దొడ్డ శ్రీనివాసరావు దుప్పట్లు లుంగీలు అందజేయడం చాలా సంతోషకరం అంటూ. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆశ్రమంలోని అందరూ దీవించారు.. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ చైర్మన్కజగన్ మోహన్ రావు కుంద నాగభూషణన రావు సముద్రాల పురుషోత్తం. కొప్పు రావూరి రామ యోగేశ్వరరావు. తదితరులు పాల్గొన్నారు.