సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం
Published: Thursday June 03, 2021
వలిగొండ, ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీపీ నూతి రమేష్ రాజు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిందని సోనియాగాంధీ అని ఆమె సేవలు పార్టీకి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమా బాల నరసింహ, ఎంపిటిసిలు, సర్పంచ్లు, కాంగ్రెస్ మండల పార్టీ,పట్టణ అధ్యక్షులు, మరియు మండల కాంగ్రెస్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: