పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మరియు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతకు ధన్యవాదాలు తెలియజేస
Published: Friday November 11, 2022
అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా బూర్గంపహాడ్ మండలం సారపాక గాంధీనగర్ లోని ఒడియా క్యాంపులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీసుకుని అక్కడున్నటువంటి (సిసి రోడ్) సమస్యలను బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అక్కడున్నటువంటి సమస్యను గుర్తించి పరిష్కరించినటువంటి. ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా.కాంతారావు కి ఒడియా క్యాంపు మహిళలు ప్రత్యేకంగా ముందుకు వచ్చి ఎమ్మెల్యే కి మరియు బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలు మాట్లాడుతూ మా సమస్యలు తెలుసుకుని అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమం ద్వారా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ డ్రైనేజీలు మంచినీళ్లు, రోడ్లు, సమస్యను పరిష్కారం చేసినటువంటి జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే కాలంలో మాకు ఎవరైతే మంచి చేస్తారో వారిని ప్రజలు తప్పక గుర్తు పెట్టుకుంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
Share this on your social network: