పాఠశాల అభివృద్ధికీ కృషి : సర్పంచ్ కె రాజిరెడ్డి
Published: Friday July 30, 2021
పరిగి 29 జులై ప్రజాపాలన ప్రతినిధి ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి అన్నారు. గురువారం దోమలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పాఠశాల ఛైర్మెన్ ఎండీ.గౌస్ ప్రధానోపాధ్యాయులు జయమ్మ తో కలిసి పంపిణి చేసారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అందిస్తుతున్న విద్యా బోధనతొ పాటు పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే పాఠశాల ఆవరణలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోని కిచెన్ షెడ్ నిర్మాణం పాఠశాల ప్రహరీకీ గేట్ ఏర్పాటు వంటి సమస్యలు చైర్మన్, హెచ్.ఎంలు సర్పంచ్ దృష్టికి తేగా వాటిని పరిష్కరిస్తామని, త్వరలోనే పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బెస్త లక్ష్మణ్, ఉపాధ్యాయురాలు శోభ విద్యార్థులు పాల్గొన్నారు..
Share this on your social network: