మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పీర్జాదిగూడ నాయకులు

Published: Thursday October 28, 2021
మేడిపల్లి, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో అలియాబాద్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్పొరేటర్ కొల్తూరు మహేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, మాడుగుల చంద్రారెడ్డి, బండారి రవీందర్, అలువాల దేవేందర్ గౌడ్, కొత్త శ్రీకాంత్ గౌడ్, బొడిగే కృష్ణ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.