అన్నదానం అత్యంత శ్రేష్టమైన దానం

Published: Friday November 11, 2022
సాయిబాబా మందిరంలో బాబా అన్నదానం
మధిర రూరల్ నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుశ్రీదివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు ప్రతి గురువారం  అన్నదానం దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు ఈరోజు గురువారం సందర్భంగా దాతలు రేగళ్ల బ్రహ్మ రెడ్డి, పలపోతుల రవికుమార్, గోపాల్ రెడ్డి, సంక్రాంతి గోపాలరావు, వీరవల్లి భార్గవ సాయి కృష్ణ, రామాంజనేయులు, నున్న ఫణీంద్ర కుమార్, రాయల సమరజిత, ఆర్థిక సహకారంతో నిర్వహించనైనదిఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ కార్తీక మాసంలో బాబ వారి సన్నిధిలో శివకేశవలకు అత్యంత ప్రీతిమాసమైన కార్తీకమాసంలో అన్నదాన చేయటం అంటే ఒక ప్రాణాన్ని నిలవడానికి కావాల్సినవన్నీ అన్నమే కావున అన్నదానం చేయటం అత్యంత శ్రేష్టమని దాతలు తెలిపారు ఈ సందర్భంగా దివ్య షిరిడి సాయి బాబా ట్రస్ట్ వారు మాట్లాడుతూ ప్రతివారం గురువారం నాడు దాతలు సహకారంతో బాబా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అదేవిధంగా సాయంత్రం పల్లకి సేవ బాబా భజన భక్తులచే ప్రజలచే జరుగుతుందని ఆలయ కమిటీ ట్రస్ట్ పబ్బతి రవికుమార్ వారి కుటుంబ సభ్యులు తెలియపరుస్తున్నారు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న భక్తులు సాయి కృపకు పాత్రలు సాయి దీవెనలు ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు సేవా కార్యక్రమం ప్రజలు పాల్గొని చేస్తారు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీచర్ బ్రహ్మారెడ్డి శ్రీహరి సత్యవతి  భక్తులు పాల్గొన్నారు