బంజారా భవన్ కోసం స్థలం కేటాయించాలని మంత్రి మల్లారెడ్డికి వినతి

Published: Tuesday February 21, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి)
మేడిపల్లి మండల పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్లలో బంజారా భవన్,కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల  కొరకు స్థలం కేటాయించాలని స్థానిక కార్పొరేటర్లు భూక్య సుమన్ నాయక్, కేతావత్ సుభాష్ నాయక్ లు సోమవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి  నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు.  సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు బంజారా భవన్ కోసం స్థలం కేటాయించవలసిందిగా కలెక్టర్ కు  లెటర్ రాశారు. తొలుత సేవాలాల్ జయంతిని ఈనెల 15వ తేదీన మేడిపల్లి మండల్ లో అధికారికంగా ఘనంగా నిర్వహించినందుకు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.