ఎంపీ సంతోష్ కుమార్ కు పూల మొక్కను బహూకరిస్తున్న మద్ది యుగేంధర్ రెడ్డి
Published: Wednesday July 07, 2021
మేడిపల్లి, జులై 6 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, పీర్జాదిగూడ నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి అడవి ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున హరితహార కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగేందర్ రెడ్డి గౌరవ పూర్వకంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు పూల మొక్కను బహూకరించారు.
Share this on your social network: