సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

Published: Saturday September 24, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధిమండలంలోని శుక్రవారం నాడు మాటూరు పేట గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను  స్థానిక సర్పంచి రావూరి శివనాగకుమారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు గురువారం అందజేశారు. గ్రామానికి చెందిన సామినేని పద్మావతికి 22,500రూపాయలు, పాకలపాటి సురేష్ కి 60 వేలు, గుర్రాల కృష్ణారెడ్డి 40 వేలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రత్యేకంగా కృషి చేయటం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలంతా  ఉపయోగించుకోవాలని వారు  కోరారు. సీఎం రీలీఫ్ ఫండ్  చెక్కులు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో నెలలోపే అనేకమందికి వస్తున్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తాటికొండ వెంకటేశ్వరావు, బొల్లెద్దు వెంకయ్య, తల్లపు రెడ్డి నాగిరెడ్డి,బాణాల రంగారావు, పాకల పాటి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.