దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రై సైకిళ్లు అందజేత

Published: Friday January 07, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేది 6 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన 106 మంది దివ్యాంగులకు తన స్వంతనిధులతో ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వార కృత్రిమ అవయవాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్మంచిరెడ్డి కిషన్ రెడ్డి. పదిమంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వివిధ కృత్రిమ పరికరాలతోపాటు, ఉచిత బస్ పాస్ లు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి  ఎంపిపి కృపేష్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి, డిపో మేనేజర్ బాబునాయక్, వి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలె జంగయ్య, కౌన్సిలర్లు నల్లబోలు మమత, భర్తాకి జగన్, నాయకులు మల్లేష్ యాదవ్, జెర్కోని రాజు, పాతూరి రాజేష్ గౌడ్, నిట్టు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.