ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను సన్మానించిన కౌన్సిలర్స్
Published: Friday April 16, 2021
జగిత్యాల, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలోని కృతజ్ఞత సభలో 18వ వార్డును జోనల్ మార్పునుండి రెసిడెన్షియల్ జోన్ మార్పుగా ప్రభుత్వం నుండి ప్రొసీడింగ్ తీసుకువచ్చిన స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణిని 18వ వార్డు కౌన్సిలర్ చుక్క నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గట్టు సతీశ్ సిరికొండ పద్మ సింగరావ్ బొడ్ల జగదీశ్ పిట్ట ధర్మరాజు నాయకులు డిష్ జగన్ ఆనంద్ రావ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: